సంబాల్పూర్, జూన్ 12: ఒడిశాలో 2 వేల ఏండ్ల నాటి వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డాయి. మౌర్యుల తర్వాతి కాలానికి చెందిన నాగరికతగా పురాతత్వ పరిశోధకులు భావిస్తున్నారు. బర్పలిలోని అసుర్గఢ్ ప్రాంతంలో గంగాధర్ మెహెర్ యూనివర్సిటీ చరిత్ర విభాగానికి చెందిన అధ్యాపకులు, విద్యార్థులు తవ్వకాలు జరిపారు.
42 ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ ప్రాంతంలో రెండు కోటలు, వాటి చుట్టూ రెండు పెద్ద చెరువులు, మూడు గేట్లు ఉన్నాయని ప్రొఫెసర్ అతుల్ ప్రధాన్ వివరించారు. నాణేలు, సీళ్లు, ఇనుప ఆయుధాలు, టెర్రకోట బొమ్మలు వంటివి లభించాయని చెప్పారు. అక్కడ దొరికిన వస్తువులు, తవ్వకాల ద్వారా పట్టణ నాగరికత వెలసిల్లిందనే విషయం తెలుస్తున్నదని తెలిపారు.