యాదాద్రి భువనగిరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులో టాటా ఇండిగో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఇందలో ప్రయాణిస్తున్న రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన అంబటి భావనారుషి,గీత దంపతులు చిన్న కూతురు కార్తిక (2) అక్కడికక్కడే మృతి చెందింది.
పెద్ద కూతురు అమూల్య, భావన రుషికి స్వల్ప గాయాలవ్వగా భార్య గీతకి తీవ్రంగా గాయపడింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.