హైదరాబాద్, ఏప్రిల్15 (నమస్తే తెలంగాణ): తలసేమియా, సికెల్ సెల్ సొసైటీ (టీఎస్ సీఎస్) ఆధ్వర్యంలో 97 ఎముక మజ్జ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీఎస్ సీఎస్ ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. దీనికి తోడ్పాటును అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సంకల్ప్ ఇండియా ఫౌండేషన్, ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్కు టీఎస్ సీఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ విజయం మరింత మందికి ప్రేరణగా నిలుస్తుందని కొనియాడింది. కార్యక్రమంలో టీఎస్ సీఎస్ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ ‘ఎముక మజ్జ మార్పిడి విజయవంతమై 97 మంది పిల్లలు సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చారని తెలిపారు.