డాక్టర్ కేబీ బక్షీ, డాక్టర్ రాజన్ మంజురన్కు ‘జీవితకాల సాఫల్య పురస్కారం’ ప్రదానం
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రపంచదేశాల సగటుతో పోల్చితే మనదేశంలో పదేండ్ల ముందుగానే గుండెపోట్లు వ స్తున్నట్టు హృద్రోగ నిపుణులు హెచ్చరించారు. జీవన విధానమే శాపంగా మారుతున్నదని పే ర్కొన్నారు. ‘కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇం డియా-2021’ వార్షిక సదస్సు గురువారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. దేశ, విదేశాలకు చెందిన దాదాపు వె య్యిమంది నేరుగా హాజరయ్యారు. వర్చువల్గా 10 వేల మందికిపైగా భాగస్వాములయ్యారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ కార్డియాలజిస్ట్లు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఉ న్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సులో గుండెకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు. మొదటి రోజు సదస్సు ను ప్రారంభించిన అనంతరం పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కేబీ బక్షీ, కేరళకు చెందిన డాక్టర్ రాజన్ జో సెఫ్ మంజురన్కు జీవిత సాఫల్య పురస్కారాలను (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్) ప్రదా నం చేశారు.
కదులకుండా కూర్చుంటే ధూమపానం చేసినట్టే: మోహనన్ పదినహరె
సీఎస్ఐ-2021 ప్రెసిడెంట్ డాక్టర్ పీ మో హనన్ పదినహరె మాట్లాడుతూ.. ఓ సర్వే ప్ర కారం దేశ జనాభాలో 28-30 శాతం మంది ధూమపానం చేస్తున్నారని, 50-60 శాతం మందిలో చెడుకొవ్వు అధికంగా ఉన్నట్టు తేలి ందని అన్నారు. చాలామంది ధూమపానానికి దూరంగా ఉన్నామని సంతోష పడుతుంటార ని.. కానీ శారీరక శ్రమ చేయకపోవడం, గంటలపాటు కదలకుండా కూర్చోవడం కూడా ధూమపానంతో సమానమేనని స్పష్టం చేశా రు. మారుతున్న టెక్నాలజీని వైద్య నిపుణులు నిరంతరం అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని సూచించారు.
45 ఏండ్ల వరకు జబ్బులు లేకుంటే సేఫ్
ఒక వ్యక్తికి వంశపారంపర్యంగా గుండె స మస్యలు లేకుండా, 40-45 ఏండ్ల వరకు బీపీ, షుగర్ వంటి తీవ్రమైన జబ్బుల బారిన పడకుండా ఉంటే 70 ఏండ్ల వరకు బతికే అవకాశం ఉన్నదని సీఎస్ఐ-2021 ప్రెసిడెంట్ ఎలక్ట్, సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డా క్టర్ పీఎస్ బెనర్జీ పేర్కొన్నారు. ఇలాంటివారికి గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువని చెప్పారు. ఆధునిక యంత్రాలను మారుమూల ప్రాంతాలకు పంపి, అత్యవసర సమయాల్లో వైద్యులు వీడియోకాల్ ద్వారా వాటిని వినియోగించేలా చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. కార్డియాలజీ రంగంలో ఇటీవల వచ్చి, విజయవంతంగా వాడుతున్న అత్యాధునిక ఆవిష్కరణల గురించి వివరించారు.
2030 నాటికి ముందుగానే గుండెపోటు గుర్తింపు
శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో కలిసి ‘డీప్ న్యూ రల్ నెట్వర్క్’కు రూపకల్పన చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇది పూర్తయ్యి, విజయవంతమైతే 2030 నాటికి గుండెపోటును ముందుగానే గుర్తించే అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో సీఎస్ఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేంద్రకుమార్ జైన్, ప్రధాన కార్యదర్శి దేవబ్రతారాయ్, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ దయాసాగర్రావు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ నరసరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ రోబో సమ్థింగ్ స్పెషల్ గురూ!
‘కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా-2021’ వార్షిక సదస్సులో ఓ చిట్టి రోబో అందరినీ ఆకట్టుకున్నది. లుపిన్ పేరుతో తయారు చేసిన ఆ రోబో కృత్రిమ మేధతో అందరినీ గైడ్చేస్తూ కనిపించింది. డెలిగేట్స్కు స్వాగతం పలికింది. సమావేశ మందిరాలను లొకేట్ చేస్తూ.. ముందుకు నడిచింది. కాన్ఫరెన్స్లో చర్చించే విషయాలను తెలియజెప్పింది. హాల్ పక్కన ఏర్పాటు చేసిన లుపిన్ ఎక్స్పో ఇక్కడే ఉందంటూ దారి చూపింది.