కట్టంగూర్: దేశానికి అన్నపెట్టే రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవా రం మండలంలోని అయిటిపామల రిజర్వాయర్ నుంచి కింది ప్రాంతా లైన నకిరేకల్, కేతేపల్లి మండలాల్లోని చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్, కేతేపలి, కట్టంగూర్ మండలాల్లోని వ్యవసాయ రంగానికి నీరందించేందుకు రిజర్వాయర్ నుంచి ప్రతి రోజు 300క్యూ సెక్కుల నీటిని విడుదల చేయడం జరుతుందన్నారు.
7సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో కోట్లాది రూపాయల నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కేవలం 4 సంవ త్సరాల్లో పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగా నికి నీరందించేందుకు అయిటిపాములలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరిన 5మాసాల్లోనే రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.
లిప్ట్ ఏర్పాటు సర్వే పనులు మొదలైనవని వారం రోజుల్లో టెండర్ పక్రియ పూర్తి కాగానే వచ్చే సంవత్సరానికి పనులు పూర్తయి 10వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. ప్రభుత్వం పెం డింగ్ బిల్లులు చెల్లిండంతో ఉదయ సముద్రం ప్రాజెక్టు లైనింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 7 మాసాల్లో పునులు పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించి లక్ష ఎకరాలకు సాగునీరందించడం జరుగుతుందన్నారు. రైతులు బాగుండాలనే ధ్యేయంతో ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.
అయిటిపాములలో లిఫ్ట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కట్టంగూర్, నకిరేకల్ జడ్పీటీసీలు తరాల బలరాము లు, మాద ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, ఇరిగేషన్ నకిరేకల్ సబ్ డివిజన్ డీఈ భూషణాచారి, ఏఈలు అంజనేయులు, పాండు, ఎంపీటీసీ నలమాద వీరమ్మ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చౌగోని నాగరాజు, నాయకులు మంగదుడ్ల వెంకన్న, అంజనేయులు, గోలి శివ, తదితరులు పాల్గొన్నారు.