హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పథకం అమలు చేసేందుకు రూ.55,36,68,000 అదనపు నిధులను కేటాయిచింది. ఈ మేరకు శుక్రవారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం రఘునందన్రావు తెలిపారు.