హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): న్యాయ కళాశాలల్లో ఎల్ఎల్బీ 3, 5 ఏండ్ల కోర్సులతోపాటు ఎల్ఎల్ఎం కోర్సుకు తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఈ 3 క్యాటగిరీల్లోని మొత్తం 6,503 సీట్లకు 11,108 మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లను ఎంచుకోగా.. 5,339 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 966 సీట్లు మిగిలి ఉన్నాయి. సీట్ల కేటాయింపు వివరాలను లాసెట్-2021 వెబ్పోర్టల్లో అందుబాటులో ఉంచినట్టు అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్బాబు వెల్లడించారు. తొలి విడతలో సీట్లు పొందినవారంతా తమ సర్టిఫికెట్లతో సహా ఈ నెల 23లోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని, 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.