తిరుమల/హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): శ్రీవారి ట్రస్టు ద్వారా దేశవ్యాప్తంగా 500 వేంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే వారణాసి, ముం బైలోనూ శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామన్నారు. కశ్మీర్లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాన్ని వచ్చే 18 నెలల్లో పూర్తిచేస్తామని తెలిపారు. శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. టీటీడీ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ‘గుడికో గోమాత’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వామివారికి గోవు ఆధారిత ఎరువులతో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ధాన్యంతో నైవే ద్యం సమర్పించాలని నిర్ణయించా మన్నారు. ఇం దుకు రైతులతో సహజ పంటలపై చర్చిస్తామని తెలిపారు. టీటీడీలోని ప్రతి కాంట్రా క్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగిని రెగ్యులరైజ్ చేసేందుకు నూతన విధానం తీసుకురాబోతున్నట్టు చెప్పారు. 90 రోజుల్లో దీని పై నివేదిక రూపొందిస్తామని తెలిపారు.