ఉప్పల్, డిసెంబర్ 16 : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతంతోపాటు పంపిణీచేయనున్న స్నాక్స్ను తయారుచేసేందుకుగాను నాచారంలోని తెలంగాణ ఫుడ్స్లో రూ.42 కోట్లతో ఎక్స్ట్రూడర్ ప్లాంట్ను తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసింది.
ఈ స్నాక్స్ ఫుడ్స్ ప్లాంట్ను రాష్ట్ర శిశు, మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.