హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రకు 39వ బృందం మంగళవారం తరలివెళ్లింది. ఈ బృంద యాత్రికులకు హైదరాబాద్లోని హజ్ హౌజ్లో హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం, కర్ణాటక మున్సిపల్, హజ్ శాఖల మంత్రి రహీం ఖాన్ వీడ్కోలు పలికారు. యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. ఇప్పటివరకు 5,850 మంది యాత్రకు వెళ్లినట్టు సలీం తెలిపారు.
కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ రఫీయుద్దీన్ కచేరివాలే, బీదర్లోని షాహీన్ గ్రూప్ విద్యాసంస్థల చైర్మన్ అబ్దుల్ ఖాదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు సయీద్ గులాం అహ్మద్, ఇర్ఫాన్ ఉల్ హక్, కమిటీ ఏఈవో ఇర్ఫాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.