హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఓటర్లుగా ఉండి ఏపీలోని పనిచేస్తున్న వారు ఓటుహక్కు వినియోగించుకునేందుకు 30న వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం సీఈవో ముఖేశ్కుమార్ మీనా శుక్రవారం జారీ చేశారు.