హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఇంటర్ ప్రవేశాల గడువును మరో సారి పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ, ప్రయివేట్, ఎయిడెడ్ కాలేజీల్లో ఫస్టి యర్ ప్రవేశాల గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ తెలిపారు. ఆన్లైన్లోఅడ్మిషన్స్ లాగిన్ సోమవారం (ఈ నెల 21) నుంచి తెరుచుకుంటుందని, ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారు 27 వరకు అడ్మిషన్లు పొందవచ్చని సూచించారు.
రాష్ట్రంలో 1500 పైచిలుకు ప్రైవేట్ కాలేజీలుండగా, మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా ఇప్పటివరకు 344 వరకు కాలేజీలు ఇంటర్ అనుబంధ గుర్తింపును దక్కించుకోలేకపోయాయి. ఇవేకాకుండా మరో 168 కాలేజీల గుర్తింపు మంజూరు అంశం పెండింగ్లో ఉన్నది. దీంతో ఈ కాలేజీల్లో చేరినవారు ఆన్లైన్లో నమోదుకాకపోవడంతో టెక్నికల్గా ప్రవేశాలు పొందనట్టే. ఇలా లక్ష మందికి పైగా విద్యా ర్థులు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందలేదు. ఏటా 4.5 లక్షలకు పైగా అడ్మిషన్లు నమోదవుతుండగా, ఈ ఏడాది అనుబంధ గుర్తింపు జారీచేయని కారణంగా అక్టోబర్ 15 వరకు 3,90,916 అడ్మిషన్లు మాత్రమే నమోదయ్యాయి.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలయ్యింది. నవంబర్ 30 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారితో పాటు గతంలో అనుత్తీర్ణులు అయిన వారు ఫీజు చెల్లించే అవకాశమిచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి.