హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మి ది నెలల్లోనే సింగరేణి టర్నోవర్లో భారీ వృద్ధిని సాధించిందని సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. గడిచిన 9 నెలల్లో రూ. 23,225 కోట్ల టర్నోవర్ సాధించినట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సాధించిన రూ.18,956 కోట్ల టర్నోవర్తో పోల్చుకుంటే ఇది 23 శాతం అధికమని తెలిపారు. ఇదే స్థాయిలో ముందుకెళితే.. ఈ ఆర్థిక సంత్సరం చివరి నాటికి టర్నోవర్ రూ. 34 వేల కోట్లకు చేరుకోనున్నట్టు అంచనా. గత తొమ్మిది నెల ల్లో బొగ్గు అమ్మకాల ద్వారా రూ. 19,934 కోట్లు, విద్యుత్తు అమ్మకాల ద్వారా రూ. 3,291 కోట్ల టర్నోవర్ను సింగరేణి సాధించింది. సింగరేణిలో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎండీ శ్రీధర్ బుధవారం డైరెక్టర్లు, అడ్వైజర్లు, ప్రాజెక్ట్ ప్లానింగ్ అధికారులు, ఏరియా జీఎంలతో సమీక్ష నిర్వహించారు.
వచ్చే ఐదేండ్లలో చేపట్టనున్న 10 ప్రాజెక్టులపై వారు చర్చించారు. ఈ కొత్త సంవత్సరం లో కనీసం నాలుగు కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి నిర్ణయించుకుంది. ఇం దులో ఒడిశాలోని నైనీతోపాటు మరో మూడు ఉపరితల గనుల (ఓసీ) నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎండీ ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఒడిశాలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని సీఎండీ స్పష్టం చేశారు. దీనితోపాటు కొత్తగూడెంలో చేపట్టిన వీకే కోల్మైన్, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఉపరితల గని, ఇల్లందు ఏరియాలోని జేకే ఓసీ విస్తరణ (రొంపేడు) గని నుంచి జూన్, జూలై నెలల్లో ఉత్ప త్తి చేపట్టాలని నిర్దేశించారు. కొత్త ఓపెన్కాస్ట్ గనుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని కూడా నిర్ణయించారు. సమావేశంలో డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు, అడ్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.