హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో చేపట్టిన నియామకాలపై అభ్యర్థులకు ఎట్టకేలకు ఊరట లభించింది. డీపీఎడ్, బీపీఎడ్ అభ్యర్థుల వివాదానికి ముగింపు పలుకుతూ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. 1 నుంచి 5వ తరగతి వరకు డీపీఎడ్ అభ్యర్థులు, 6 నుంచి 10వ తరగతి వరకు బీపీఎడ్ అభ్యర్థులు, 5 నుంచి 8వ తరగతి వరకు ఆ రెండు క్యాటగిరీల అభ్యర్థులు అర్హులని జస్టిస్ అభినవ్కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం పేర్కొన్నది. తదనుగుణంగా నియామకాలు చేపట్టాలని ఆదేశించిం ది. 616 పీఈటీ పోస్టుల భరీకి 2017లో నోటిఫికేషన్ను జారీ చేసిన ప్రభుత్వం..తొలుత డీపీఎడ్ అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. దీనిపై బీపీఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం వారిని కూడా అర్హులుగా ప్రకటించింది. అనంతరం పరీక్షను నిర్వహించి 1,200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టింది. 600 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక ఆ పోస్టులు తమకే చెందాలని డీపీఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో నాటి నుంచి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ పెండింగ్లో పడిపోయింది. తాజాగా హైకోర్టు ఈ వివాదానికి ముగింపు పలకడంతో 2017 పీఈటీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.