(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): భూమిపై నివసించే సకల జీవరాశికి ఎంతటి ఉష్ణోగ్రత అవసరమన్న దానిపై ఏండ్లకేండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో అధ్యయనాల తర్వాత తాజాగా పరిశోధకులు దీనిపై ఓ నిర్ధారణకు వచ్చారు. ప్రాణకోటికి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత చాలని తేల్చిచెప్పారు. నార్వే, టాస్మానియా, కెనడా, స్కాట్లాండ్, జర్మనీ, హాంకాంగ్, తైవాన్కు చెందిన నిపుణుల ప్రకారం.. మనుషులతో పాటు గాలి, నీటిలో నివసించే వివిధ రకాల జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల వంటి ఇతర జీవజాలాలకు 20 డిగ్రీల ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. 20 డిగ్రీల సెల్సియస్ వంటి కనీస ఉష్ణోగ్రత పరిసరాల్లో ఉంటే ఎక్కువ వేడిమిని ఉత్పత్తి చేసే అవసరం శరీరానికి అంతగా అవసరపడదు. దీంతో జీవుల శక్తి, సామర్థ్యాలు వృథా కాబోవని పరిశోధకులు వివరించారు.