కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో విస్తుపోయే ఘటన చోటుచేసుకున్నది. దోమకొండకు చెందిన 14 ఏండ్ల బాలిక శిశువుకు జన్మనిచ్చింది. రెండు రోజుల క్రితం నొప్పులు రావడంతో దవాఖానాలో చేరిన బాలిక నేడు పురుడుపోసుకున్నది. కాగా, బాలిక తల్లి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్నది. అతడే ఈ మైనర్ బాలికను కూడా గర్భిణీని చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.