రాయపర్తి, సెప్టెంబర్ 6: నాలుగు దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాయపర్తి మండల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెంటే ఉంటామని జేతురాం తండా జీపీ పరిధిలోని జేతురామ్ తండా, రావుల తండా, విద్యానగర్ తండాల గ్రామస్థులు ప్రకటించారు. బుధవారం జిల్లాలోని సంగెం మండలంలోని కాపుల కనపర్తి పర్యటనలో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సురేందర్రావు నేతృత్వంలో సుమారు 100 గిరిజన కుటుంబాల వారు కలిసి సామూహికంగా మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు జెండాలకు అతీతంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండల ప్రజలందరి సంక్షేమం కోసం నిర్విరామంగా పని చేస్తున్నారని కొనియాడారు. నాడు వర్ధన్నపేట నేటి పాలకుర్తి నియోజకవర్గంలో రాయపర్తి మండలం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న మంత్రి ఎర్రబెల్లిని తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ వీడబోమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును అఖండ మెజారిటీతో గెలిపించుకుని పాలకుర్తి నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు.