కొల్లాపూర్/నాగర్ కర్నూల్, అక్టోబర్ 3 : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్లోకి 1.5 టీఎంసీల నీరు చేరడంతో జలకళ సంతరించుకున్నది. రెండు నల్లమల కొండలను కలుపుతూ 2,224 ఎకరాల విస్తీర్ణంలో 11.02 కిలోమీటర్ల పొడవు, 74 మీటర్ల ఎత్తు, 8.41 టీఎంసీల సామర్థంతో రిజర్వాయర్ను నిర్మించారు. ఒక్క మోటర్ ద్వారా నీటిని విడుదల చేయడంతో నార్లాపూర్ రిజర్వాయర్లోకి 1.5 టీఎంసీలు చేరుకున్నాయి. దీంతో నల్లమల కొండలను కృష్ణమ్మ ముద్దాడింది. సోమవారం మధ్యాహ్నం తరువాత మోటర్ను బంద్చేశారు.