హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ): రెండేండ్లల్లో రైతు సంక్షే మ కోసం రూ.1,09,400 కోట్లకుపైగా ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తూ, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడం, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.
బడ్జెట్ అనంతరం ఆయన స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకుండా రూ. 2 లక్షల్లోపు రుణాలను మొదటి పంటకాలంలోనే ఒకే దఫాలో మాఫీ చేసి లక్షలాది రైతు కుటుంబాలను నిజమైన రుణ విముక్తులుగా మా ర్చిందని స్పష్టంచేశారు. రైతు భరోసా విషయంలోనూ తమ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి, ఇది నిజమైన రైతు ప్రభుత్వం అని చాటి చెప్పిందని పేర్కొన్నారు.