కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 13: పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ సమీపంలోని లిఫ్ట్-1 సర్జ్పూల్ను కృష్ణమ్మ ముంచెత్తింది. మంగళవారం జీరో పాయింట్ నుంచి ఓపెన్ కెనాల్ ద్వారా హెడ్రెగ్యులేటరీ మీదుగా నీటిని విడుదల చేయగా.. టన్నెళ్ల గుండా సర్జ్పూల్కు చేరింది. అయితే బుధవారం 0.006 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ ఉంచారు. ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని విధంగా అతి పెద్ద మహాబాహుబలి మోటర్లు (ఒక్కోటి 145 మెగావాట్ల సామర్థ్యం) బిగించారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించనున్నారు. దీంతో ముందుగానే టెస్టింగ్ కోసం నీటిని తరలించినట్టు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.