హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినతరం చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ చైర్మన్ కే నారాయణ పేర్కొన్నారు. చట్టంలోని లోపాలను సరిదిద్దకపోవడంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని వాపోయారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఏ పార్టీ తరఫున పోటీ చేశారో ఎలక్షన్ కమిషన్ వద్ద స్పష్టమైన రికార్డు ఉంటుందని పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి ఫిరాయిస్తే వెంటనే అనర్హత వేటు పడేలా చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా మార్పులు చేస్తే ఫిరాయింపులు ఉండవని పేర్కొన్నారు.