హైదరాబాద్ : తెలంగాణలోని ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టులో దాఖలు అయిన పిల్ను తాజాగా కోర్టు కొట్టేసింది. 2016లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. దానిపై 2017లో ఓ నిరుద్యోగి హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. అప్పుడు కోర్టు ఆ జీవోపై స్టే విధించింది. దీంతో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా.. క్రమబద్ధీకరణపై దాఖలు అయిన పిల్ను సీజే జస్టిస్ చంద్రశర్మ ధర్మాసనం కొట్టేసింది. దీంతో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయింది.