కొల్లాపూర్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టణంలోని వరిదేలకు చెందిన 25మంది గౌండ్లు, కుడికిళ్ల గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, అదే గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో గులాబీ గూటిలోకి చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ సురగౌని వెంకటస్వామి గౌడ్, మాజీ ఉపసర్పంచ్ విష్ణుగౌడ్, కాంగ్రెస్ నాయకుడు ఊషన్నగౌడ్, గౌడ సంఘం ప్రతినిధులు వెలుగొండ నర్సింహగౌడ్, చిలుక వెంకటస్వామిగౌడ్, మాచర్ల శ్రీనివాస్గౌడ్, తమటం పరమేశ్గౌడ్, నానిగౌడ్, తమటం శివకుమార్గౌడ్, అశోక్ కుమార్ గౌడ్, మహేశ్గౌడ్, దిలీప్ కుమార్గౌడ్, నరేశ్గౌడ్, మహేశ్గౌడ్తోపాటు పలువురు గౌండ్లు టీఆర్ఎస్లో చేరారు.
అలాగే మండలంలోని కుడికిళ్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్ బాలయ్య, మాజీ వార్డుసభ్యులు నాగరాజు, విజయ కుమార్, బీజేపీకి చెందిన శివ మల్లేశ్, అంజి, బందని శ్రీను తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.వీరందరికి టీఆర్ఎస్ కండువాలు కప్పి సాదరంగా ఎమ్మెల్యే బీరం ఆహ్వా నించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు నిరంజన్, మాజీ అధ్యక్షులు పిన్నంశెట్టిబాలు, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు తాళ్ల పరుశురాంగౌడ్, నాయకులు ఎల్లాగౌడ్, తమటం వెంకటస్వామిగౌడ్, దగడాల సుదర్శన్గౌడ్, సింగిల్విండో చైర్మన్ కృష్ణయ్య, బొరెల్లి మహేశ్, తదితరులు పాల్గొన్నారు.