హైదరాబాద్ సనత్నగర్లోని అల్లీడ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థ కూడా మరో ఎలక్ట్రిక్ సైకిల్ను తయారుచేసింది. ఈ సైకిల్ను ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ (ఈఎస్సీఐ) డైరెక్టర్ డాక్టర్ జీ రామేశ్వర్రావు మంగళవారం ప్రారంభించారు. లిథియం బ్యాటరీ ద్వారా నడిచే ఈ సైకిల్ ఒక్కసారి చార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం వెళ్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అల్లీడ్ సంస్థ డైరెక్టర్ రామేశ్వరరావు అభినందించారు. ఈఎస్సీఐ ప్రొఫెసర్ సురేందర్రెడ్డి మొదటి సైకిల్ను కొనుగోలుచేసి తదుపరి పరిశోధనల నిమిత్తం కాలేజీకి అందించారు. – హైదరాబాద్, సిటీబ్యూరో