సూర్యాపేట, జూన్ 20 : రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతోపాటు వివిధ రంగాల్లో ఉత్సాహవంతులను ఆర్థికంగా ఎదుగడానికి రుణాలు అందించి అండగా నిలుస్తున్నది. అందులో భాగంగా జిల్లాల వారీగా రుణ ప్రణాళికలను తయారు చేసి దాని ఆధారంగా రుణాలను మంజూరు చేస్తున్నది. సూర్యాపేట జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా రూ.4,658.41 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రుణ ప్రణాళికలలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాదాపు రూ. 3,627.90 కోట్ల కేటాయించారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ సంస్థలకు(స్వయం సహాయక సంఘాలకు) రూ.395.44 కోట్లు, విద్యా రుణాలకు రూ.32.40 కోట్లు, హౌసింగ్ లోన్స్ రూ. 180.00 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రచర్కు రూ. 30.23 కోట్లు , పునరుత్పాదక రంగాలకు రూ. 64.02 కోట్లు , నాన్ ప్రాపర్టీ రంగాలకు రూ. 328.42 కోట్లు కేటాయించడం జరిగింది.
వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సమైక్య రాష్ట్రంలో కూలి పోయిన వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. రైతు బంధు, రైతు రుణమాఫీతోపాటు రైతులకు వ్యవసా య, దాని అనుబంధ రంగాల అభివృద్ధ్దికి రుణాల అందించి ప్రోత్సహించడం జరిగింది. ప్రతి సీజన్లో దాదాపు రూ. 320 కోట్ల్ల రైతు బంధుతో పాటు రుణాలను మంజూరు చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ. 3,627.90 కోట్లు కేటాయించారు. క్రాప్ ప్రొడక్షన్ , నిర్వహణ, మార్కెటింగ్ కోసం దాదాపు 1.91 లక్షల మంది రైతులకు రూ. 2,452.40 కోట్ల ఇవ్వనున్నారు. వ్యవసాయ టర్మ్లోన్లో వ్యవసాయ బావులు, హార్టికల్చర్ ప్లాంటేషన్, డెయిరీ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం తోపాటు ఇతర రంగాలకు రూ. 297.54 కోట్లు, వ్యవసాయ రంగం మౌలిక వసతులైన మార్కెట్ యార్డ్, గోదాములు, కోల్డ్ స్టోరేజ్, భూ ముల అభివృద్ధి, వ్యవసాయ బయో టెక్నాలజీ, సీడ్ కంపెనీలు ఇలా వాటి అనుబంధ రంగాలకు సుమారు రూ.201.98కోట్లు ఇవ్వనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లు, క్రాప్లోన్స్ వీటికి సుమారు రూ. 675.98 కోట్లు కేటాయించారు.
2021-22లో లక్ష్యానికి మించి..
2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 4,146. 88 కోట్లు రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అంతకు మించి రుణాలు అందించారు. దాదాపు రూ. 4,457.85 కోట్ల రుణాలు మంజూరు చేశారు. వ్యవసాయ రంగానికి 19 35.57 కోట్లు టార్గెట్ ఉండగా సుమారు రూ. 2 వేల కోట్లు రుణాలు అందించారు. స్వయం సహాయక సంఘాలకు రూ. 408.09 కోట్లు టార్గెట్ ఉండగా దాదాపు రూ. 679 కోట్లు ఇవ్వడం జరిగింది. గృహరుణాలు రూ. 99 కోట్లు టార్గెట్ పెట ్టగా దాదాపు రూ. 233 కోట్లు మంజూరు చేశారు. విద్యారుణాలు రూ. 72 కోట్లు కేటాయిస్తే రూ. 117.31 కోట్లు ఇచ్చారు. పరిశ్రమలకు రూ. 381 కోట్లు ఇవ్వగా రూ. 339 కోట్లు అందించారు.