సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో సర్ (SIR) ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ దళం అవగాహన కార్యక్రమాలు చేపుతున్నది. ఓటరు నమోదు ఫామ్లు నింపేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం డిమాండ్ చేశారు. సూర్యాపేట మండలం రామారం గ్రామంలో బూత్ లెవల్ ఏజెంట్లతో కలిసి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు నమోదును అందదరూ సద్వినియోగం చేసుకునేందుకు గడువు పొడిగించాలన్నారు. ఓట్ల గల్లంతు చేయాలన్న బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను సాగనివ్వమని పేర్కొన్నారు. .