మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్యతో బిజీగా ఉండగా, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మే 13న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ చేయనున్నాడు. ఈ చిత్రాలకు మోహన్ రాజా, మెహర్ రమేష్ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోను చిరంజీవి ఓ సినిమా చేయనుండగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నవీన్ ఎర్నేని – వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను బాబీ కోర్ట్ డ్రామాగా తెరకెక్కించనున్నారని, ఠాగూర్ మాదిరిగా సమాజంలో జరిగే లోపాల్ని ఎత్తి చూపే కథగా ఉంటుందని టాక్. అలానే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎమోషన్తో కూడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. వీరయ్య అనే టైటిల్తో ఈ మూవీ కి ప్రచారం జరుగుతుంది.