కొవిడ్ భయం తగ్గుముఖం పడుతున్నది. బడులు కూడా ప్రారంభం అవుతున్నాయి. స్కూళ్లు మొదలైతే సహజంగానే రకరకాల కార్యక్రమాలు నడుస్తాయి. వార్షికోత్సవాలు, ఆటల పోటీలు అంటూ హడావుడి మొదలవుతుంది. అంతవరకూ బాగానే ఉంది. కానీ, ఇలాంటి సందర్భాల్లో నిర్వహించే పరేడ్ పిల్లల పాలిట ప్రాణాంతకం కావచ్చు. మండుటెండలో వడదెబ్బకు లోనయ్యే ప్రమాదం ఉంది. జార్జియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ సమస్య మీదే దృష్టి పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలకు మిట్టమధ్యాహ్నాలను ఎంచుకోవద్దనీ, ఆ సమయంలో పిల్లలు మందపాటి కోట్లు ధరించకుండా చూడాలనీ, మధ్యమధ్యలో విరామం ఇవ్వాలనీ, మంచినీళ్లు అందుబాటులో ఉంచాలనీ చెబుతున్నారు. ఒకేసారి అలాంటి వాతావరణంలోకి తీసుకువెళ్లి గంటల తరబడి నిలబెట్టకుండా… acclimatization (వాతావరణానికి క్రమంగా అలవాటు పడటం) పద్ధతి ద్వారా నిదానంగా వారి శరీరాలకు వేడినీ, శ్రమనూ అలవాటు చేయాలని సూచిస్తున్నారు.