లండన్: ఇంగ్లండ్ కౌంటీల్లో భారత క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఇప్పటికే అర్ష్దీప్సింగ్, చాహల్ వికెట్ల వేట కొనసాగుతుండగా, తాజాగా జైదేవ్ ఉనద్కత్, జయంత్ యాదవ్ ఈ జాబితాలో చేరారు. ససెక్స్ తరఫున జైదేవ్ ఐదు వికెట్లు పడగొట్టగా, మిడిలెసెక్స్కు ఐదు వికెట్లతో జయంత్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే భారత టెస్టులోకి వచ్చిన జైదేవ్..లీసెస్టర్షైర్తో మ్యాచ్లో తొమ్మిది వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన జైదేవ్..రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. లాంకషైర్తో మ్యాచ్లో స్పిన్నర్ జయంత్యాదవ్..లాంకషైర్తో మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ కాస్తా డ్రాగా ముగిసింది.