ఢిల్లీ : తన కెరీర్ చరమాంకంలో ఉన్న దశలో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ హెడ్కోచ్ రవిశాస్త్రి తనకు రిటైర్మెంట్పై స్పష్టతనివ్వలేదని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఓ పాడ్కాస్ట్లో యువీ మాట్లాడుతూ.. ‘కెరీర్ ముగింపు దశలో ఉన్నవారికి జట్టులో తమ స్థానంపై స్పష్టత అత్యంత ఆవశ్యకం. నేను అది పొందలేదు. నాతో పాటు జహీర్, సెహ్వాగ్, హర్భజన్దీ అదే పరిస్థితి. కెప్టెన్, కోచ్, సెలక్టర్ సీనియర్లతో కూర్చుని చర్చించాలి. జట్టు అవసరాల రీత్యా పరిస్థితులను వారికి వివరించాలి. ఆ సంభాషణ సజావుగా సాగకున్నా కనీసం ప్రయత్నమైనా జరగాలి.
నా విషయానికే వస్తే ఆ సమయంలో రిటైర్మెంట్పై నాకు స్పష్టత లేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ, కెప్టెన్, కోచ్ నుంచి కూడా ఏ స్పందనా లేదు. అప్పటికే నేను 37వ పడిలో ఉన్నా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కనీసం దేశం కోసం అన్ని మ్యాచ్లు ఆడినవారికి కనీసం గౌరవం అయినా దక్కాలి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయిన అనంతరం యువీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పుడు కోహ్లీ భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇదిలాఉండగా కోహ్లీ, రవిశాస్త్రి తన కెరీర్పై స్పష్టతనివ్వకపోయినా ధోనీ మాత్రం వాస్తవ పరిస్థితిని చెప్పాడని యువీ చెప్పుకొచ్చాడు.