Yusuf Pathan | భారత మాజీ ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ లోక్సభ బరిలో దిగబోతున్నాడు. పశ్చిమబెంగాల్లోని బెర్హమ్పూర్ నియోజకవర్గం నుంచి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పఠాన్ పేరు కూడా ఉంది. కాగా 2011 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో యూసుఫ్ సభ్యుడు అన్న విషయం తెలిసిందే. ఆ టీమ్ నుంచి రాజకీయాలలోకి వచ్చిన నాలుగో క్రికెటర్గా పఠాన్ నిలిచాడు.
సుమారు 28 ఏండ్ల తర్వాత ధోని సారథ్యంలోని భారత జట్టు.. వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ స్వప్నాన్ని ముంబైలోని వాంఖెడే వేదికగా నెరవేర్చుకున్న విషయం తెలిసిందే. 16 మంది సభ్యులు గల ఈ జట్టులో రాజకీయాలలోకి వచ్చిన నాలుగో క్రికెటర్గా పఠాన్ నిలిచాడు. ఈ జాబితాలో గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, శ్రీశాంత్లు పఠాన్ కంటే ముందే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో జాయిన్ అయిన గౌతం గంభీర్.. ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఘనవిజయం సాధించాడు. అతడి తర్వాత హర్భజన్ సింగ్.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున రాజకీయ అరంగేట్రం చేశాడు. 2022లో అతడు ఆప్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇక శ్రీశాంత్ విషయానికొస్తే.. 2016లో అతడు కేరళ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరఫున తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలోకి దిగాడు. కానీ అతడు మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో యూసుఫ్ నాలుగోవాడు. కాంగ్రెస్ అగ్రనాయకుడు అధీర్ రంజన్ చౌదరిపై పోటీ చేయనున్న యూసుఫ్.. రాజకీయాలలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
I’m eternally grateful to Smt. @MamataOfficial for welcoming me into the TMC family and trusting me with the responsibility to become people’s voice in the Parliament.
As representatives of the people, it is our duty to uplift the poor and deprived, and that is what I hope to… pic.twitter.com/rFM5aYyrDg
— Yusuf Pathan (@iamyusufpathan) March 10, 2024
2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు : ఎంఎస్ ధోని (కెప్టెన్),న వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, పియూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, అషిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, శ్రీశాంత్, ప్రవీణ్ కుమార్