హో చి మిన్: వియత్నాం ఓపెన్లో యువ షట్లర్ సిక్కిరెడ్డి, రోహన్ కపూర్ జోడీకి కాంస్యం దక్కింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో సిక్కిరెడ్డి, రోహన్ కపూర్ జంట 16-21, 14-21తో ఇండోనేషియా టాప్సీడ్ ద్వయం రెహాన్ నౌఫల్, లిసాఅయు కుసుమవతి చేతిలో ఓటమిపాలైంది.