న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ కిరణ్ జార్జ్.. ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. బీడబ్ల్యూఎప్ వరల్డ్ టూర్ సూపర్-100 టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏండ్ల కిరణ్ 21-19, 22-20తో కో టకాషాహి (జపాన్)పై విజయం సాధించాడు.
నిరుడు ఒడిషా ఓపెన్ నెగ్గిన కిరణ్కు ఇది రెండో ఏటీపీ-100 టైటిల్ కాగా.. సుమారు గంట పాటు సాగిన తుదిపోరులో భారత షట్లర్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. రెండు గేమ్లు హోరాహోరీగా సాగినా.. ఒత్తిడిని జయించిన కిరణ్ కీలక సమయాల్లో ముందంజ వేసి విజేతగా నిలిచాడు.