జోర్డాన్: జోర్డాన్ యువ బాక్సర్ రషీద్ ఆల్ స్వైసత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మెదడుకు తగిలిన బలమైన గాయంతో చికిత్స పొందుతూ 19 ఏండ్ల రషీద్ సోమవారం మృతి చెందాడు. ఇటీవల పోలండ్లో జరిగిన ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో రషీద్ బరిలోకి దిగాడు. ఈ నెల 16న జరిగిన 81కిలోల బౌట్ మూడో రౌండ్లో ఎస్తోనియా బాక్సర్ అంటోన్తో తలపడ్డ రషీద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దవాఖానకు తరలించి మెదడుకు అత్యవసర చికిత్స చేశారు. వైద్యులు చివరిదాకా కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రషీద్ మృతి పట్ల ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.