రాంచీ : ఫెడరేషన్ కప్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి ఎర్రాజి 100మీ. హర్డిల్స్లో స్వర్ణం కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన పోటీలో జ్యోతి మీట్ రికార్డును నెలకొల్పుతూ 12.89 సెకండ్లలో గమ్యాన్ని చేరింది. మంగళవారంనాటి హీట్స్లో 13.18 సెకండ్లతో మీట్ రికార్డును సరిచేసిన జ్యోతి ఫైనల్లో దానిని మరింత మెరుగుపరిచింది.
అంతేగాక ఆసియా క్రీడల క్వాలిఫికేషన్ టైమింగ్ 13.63 సెకండ్లనుకూడా జ్యోతి అధిగమించింది. తమిళనాడుకు చెందిన నిత్య రామ్రాజ్ 13.44 సెకండ్లతో రెండో స్థానం, జార్ఖండ్కు చెందిన సప్న కుమారి 13.58 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచారు. కాగా పురుషుల 110మీ. హర్డిల్స్ స్వర్ణాన్ని మహారాష్ట్రకు చెందిన తేజస్ అశోక్ షిర్షె గెలుచుకున్నాడు. అతడు 13.72 సెకండ్లలో రేస్ను పూర్తిచేశాడు.