WTC Final | ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్లో ఆసిస్తో తలపడనున్నది. జూన్ 7న మొదలుకానుండగా.. ఇంగ్లండ్లోని ఓవల్ వేదిగా మ్యాచ్ జరుగనున్నది. మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియాలోని పలువురు ఆటగాళ్లు లండన్కు చేరుకున్నారు. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే వికెట్ కీపర్, బ్యాట్మెన్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబయి ఇండియన్స్ తరఫున బరిలో ఉన్న ఇషాన్ కిషన్.. శుక్రవారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. 16వ ఓవర్ ముగిసిన అనంతరం ఇషాన్, బౌలర్ క్రిస్ జోర్డాన్ ఢీకొట్టుకున్నారు.
జోర్డాన్ మోచేయి ఇషాన్ కంటికి తగిలింది. దాంతో ఇషాన్ మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ సైతం దిగలేదు. అయితే, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్కు కేఎల్ రాహుల్ను బీసీసీఐ ఎంపిక చేసింది. అతను ఐపీఎల్ గాయపడగా.. ఫైనల్కు దూరమయ్యారు. అతని స్థానంలో బీసీసీఐ ఇషాన్ కిషన్ను ఎంపిక చేసింది. ఇప్పటి వరకు టెస్టుల్లో అరంగ్రేటం చేయని ఇషాన్ కిషన్.. ఏకంగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఆడే అవకాశం వచ్చింది. తాజాగా గాయం కారణంగా దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇషాన్ కిషన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి అనుభవం ఉన్నది. 48 మ్యాచ్లు ఆడిన అతను.. 38.76 సగటులో 2985 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపికైనా.. తుది జట్టులో స్థానం దక్కలేదు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛఠేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.