టోక్యో: ఇండియాకు మరో మెడల్ తృటిలో చేజారింది. రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో రెజ్లర్ దీపక్ పూనియా ( Deepak Punia ) 2-4 తేడాతో సాన్ మారినోకు చెందిన మైల్స్ నాజెల్ చేతిలో ఓడిపోయాడు. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఓడిన దీపక్.. గురువారం బ్రాంజ్ మెడల్ కోసం తలపడినా.. అక్కడా అతనికి నిరాశ తప్పలేదు. ఇంతకుముందే 57 కేజీల విభాగంలో రెజ్లర్ రవి దహియా సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.