WPL Auction : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ )వేలంలో ఎవరిని కొనుగోలు చేయాలి? ఎంత ధర పెట్టాలి ? అనే విషయమై పక్కా ప్రణాళికతో ఉంటాయి. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఛాంపియన్ ప్లేయర్స్ కొనడంపై దృష్టి పెడుతుంది. డబ్ల్యూపీఎల్ వేలంలోనూ ఆ ఫ్రాంఛైజీ తన సంప్రదాయాన్ని కొనసాగించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో మాదిరిగానే అండర్ -19 వరల్డ్ కప్ టీమ్ కెప్టెన్ను దక్కించుకుంది.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ వేలంలో ఆ ఫ్రాంఛైజీ ఈమధ్యే టీమిండియాకు అండర్ -19 వరల్డ్ కప్ ట్రోఫీ అందించిన షఫాలీ వర్మను కొనుగోలు చేసింది. ఈ యంగ్స్టర్ కోసం ఏకంగా రూ. 2 కోట్లు పెట్టేందుకు వెనుకాడలేదు.
అండర్ -వరల్డ్ 19 కప్పు గెలిచిన కెప్టెన్లను ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో కొనడం ఉన్ముక్త్ చంద్తో మొదలైంది. 2012 లో ఉన్ముక్త్ కెప్టెన్సీలోని యువ భారత్ అండర్ -19 వరల్డ్ కప్ ఛాంపియన్గా అవతరించింది. దాంతో, ఆ ఏడాది వేలంలో ఢిల్లీ అతడిని సొంతం చేసుకుంది. ఆ తర్వాత భారత్కు అండర్ -19 వరల్డ్ కప్ అందించిన పృథ్విషా (2018), యశ్ ధూల్ (2022)లను కూడా ఈ ఫ్రాంఛైజీ వేలంలో కొనుగోలు చేసింది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. డబ్ల్యూపీఎల్ వేలంలో షఫాలీ వర్మ (2023) ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
అయితే, విరాట్ కోహ్లీని తీసుకునేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు. 2008లో కోహ్లీ నేతృత్వంలో భారత్ అండర్ – 19 వరల్డ్ కప్ గెలిచింది. ఒకవేళ అతడిని కొనుగోలు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేదు. రెండేళ్ల క్రితం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆ జట్టు ఫైనల్ చేరింది. అయితే.. ముంబై చేతిలో ఓటమి పాలైంది.