WPL 2024 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్లలో మూడు గెలిచి నాలుగింట్లో ఓడి ప్లేఆఫ్స్ రేసులో ఉన్న యూపీ వారియర్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లు సోఫీ ఎకిల్స్టోన్, కిరణ్ నవిగిరెలు డబ్ల్యూపీఎల్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను వాళ్ల మ్యాచ్ ఫీజులలో భారీ కోత పడింది. డబ్ల్యూపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ఈ ఇద్దరూ ఆర్టికల్ 2.2 నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ఈ ఇద్దరికీ వాళ్ల మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రెండ్రోజుల క్రితం యూపీ వారియర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దరూ ఆర్టికల్ 2.2 లోని లెవల్ 1 నేరానికి పాల్పడ్డారని డబ్ల్యూపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో సహచర క్రికెటర్లను దూషించడం గానీ క్రికెట్ సామాగ్రాని ధ్వంసం చేయడం గానీ వంటివి నేరం కిందకే వస్తాయి.
ఢిల్లీతో రెండ్రోజుల క్రితం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ.. 19.5 ఓవర్లలో 137 రన్స్ వద్దే ఆగిపోయింది. 19వ ఓవర్ ప్రారంభానికి ముందు వరకూ 128-7గా ఉన్న ఢిల్లీ.. రెమడు రూములు వచ్చేసరికి 137 రన్స్కు ఆలౌట్ అయింది. దీంతో యూపీ ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.