WPL 2024, MI vs RCB | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొనబోయేదెవరో నేడు తేలనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్తో ఢీకొననుంది. ఎలిమినేటర్ పోరుగా ఉన్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్తో ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోగా ముంబై బౌలింగ్కు రానుంది.
ముంబైకి ఇది రెండో ప్లేఆఫ్స్ కాగా ఆర్సీబీకి ఇదే తొలిసారి. ఇరుజట్లు ఈ లీగ్లో ఇప్పటివరకూ నాలుగుమ్యాచ్లు ఆడగా మూడింట్లో ముంబైదే విజయం. ఆర్సీబీ ఒక్క మ్యాచ్లోనే నెగ్గింది. ఈ సీజన్లో ఇరు జట్లు రెండు మ్యాచ్లు ఆడగా ఆర్సీబీ, ముంబైలు తలా ఒక మ్యాచ్ నెగ్గాయి. ఇరుజట్లలోనూ స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ను మలుపు తిప్పగల ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నేటి పోరులో ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.