బెల్గ్రేడ్ : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ కాంస్య పతకం గెలుచుకుంది. క్వాలిఫయింగ్ రౌండ్లో ఓడినా.. రెపిచేజ్ రౌండ్ ద్వారా అవకాశం దక్కించుకున్న 28 ఏళ్ల వినేష్ కాంస్య పతక పోరులో స్వీడన్కు చెందిన ఎమ్మా జొన్నా మాల్మ్గ్రెన్ను 8-0 తేడాతో ఓడించింది. ప్రపంచ చాంపియన్షిప్లో రెండు పతకాలు సాధించిన రెజ్లర్గా వినేష్ రికార్డులకెక్కింది.