కోపెన్హగన్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్నకు వేళైంది. సోమవారం నుంచి డెన్మార్క్ వేదికగా ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్ నుంచి పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ 13 పతకాలు (ఒక స్వర్ణం, 4 రజతాలు, 8 కాంస్యాలు) గెలిచింది. అత్యధికంగా సింధు ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదు మెడల్స్ సాధించింది.