మౌంట్మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్నకు అద్భుత ఆరంభం! ఉత్కంఠభరితంగా సాగిన తొలి పోరులో వెస్టిండీస్ 3 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. మొదట విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (119; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో కదం తొక్కింది. అనంతరం ఛేదనలో కివీస్ 49.5 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సోఫియా డివైన్ (108) పోరాటం వృథా అయింది. హేలీ మాథ్యూస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.