రాంచి : ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత మహిళల జట్టు టైటిల్ పోరుకు చేరుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 2-0తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్లో జపాన్తో పోరుకు సిద్ధమైంది.
భారత జట్టుకు సలిమా టెటె(11ని.), వైష్ణవి విట్టల్ ఫాల్కె(19ని.) గోల్స్ సాధించిపెట్టారు. మరో సెమీఫైనల్లో జపాన్ 2-1తో చైనాను ఓడించింది.