సిటీబ్యూరో: భారత దివ్యాంగుల క్రికెట్ కెప్టెన్ ధీరావత్ మహేశ్నాయక్కు తగిన గుర్తింపు లభించింది. గత కొన్నేండ్లుగా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మహేశ్కు సౌత్ వెస్ట్రన్ అమెరికా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ జాన్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లింగాపూర్ తండాకు చెందిన మహేశ్ది నిరుపేద కుటుం బం. ఒక్కో మెట్టు ఎదిగిన ఈ యువకుడు దివ్యాంగ క్రికెటర్గా ప్రతిభ చాటుతు న్నాడు. వైకల్యం శరీరానికే కానీ ప్రతిభకు కాదని నిరూపిస్తూ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు.