బెంగళూరు: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సౌత్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సౌత్ జోన్ 2 వికెట్ల తేడాతో నార్త్జోన్ను చిత్తుచేసింది. 215 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌత్ జోన్ 8 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (54) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. తెలుగు ఆటగాళ్లు హనుమ విహారి (43), తిలక్ వర్మ (25) రాణించారు. వెస్ట్జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరిగిన మరో సెమీఫైనల్ ‘డ్రా’గా ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన వెస్ట్జోన్ ఫైనల్కు అర్హత సాధించింది.