హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ఈ నెల 15 నుంచి తెలంగాణ మాస్టర్స్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ మొదలుకాబోతున్నది. ఇండియా కన్వెన్షన్ సెంటర్లో జరుగునున్న టోర్నీకి సంబంధించిన పోస్టర్ను మంగళవారం క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు.
మరోవైపు ఇండియన్ పవర్లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నీలో పసిడి పతకం సాధించిన రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉద్యోగి ప్రదీప్కుమార్ను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ టోర్నీలో పురుషుల 83కిలోల విభాగంలో బరిలోకి దిగిన ప్రదీప్కుమార్ మొత్తం 402.5కిలోలతో పాటు డెడ్లిఫ్ట్లో 160 కిలోల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచాడు. దీని ద్వారా అఖిల భారత పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా భవిష్యత్లో రాష్ట్రం తరఫున మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.