న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కోసం బయలుదేరే ముందే భారత అథ్లెట్లు, కోచ్లు, అధికారులందరికీ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కూడా అందిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. ఇప్పటికే వారికి తొలి డోసు వ్యాక్సిన్ అందిందని తెలిపింది. విశ్వక్రీడలకు వెళ్లే అథ్లెట్లకు, అధికారులకు వ్యాక్సినేషన్ వివరాలను తెలుపాలని జాతీయ సంఘాలను కోరిన ఒక్క రోజు తర్వాత ఐఓఏ ఈ ప్రకటన చేసింది. ఒలింపిక్స్లో పాల్గొనే అందరూ పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపడతాం. జపాన్కు బయలుదేరే ముందు వ్యాక్సినేషన్ పూర్తితో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అని ఐఓఏ చీఫ్ బాత్రా వెల్లడించారు.