కొలంబో: గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో.. వాషింగ్టన్ సుందర్(Washington Sundar)ను తీసుకున్నారు. ఆసియాకప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అయితే ఆదివారం ఫైనల్ కోసం అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తీసుకున్నారు. అక్షర్ పటేల్ గాయాలు ఏ రేంజ్లో ఉన్నాయో ఇంకా తెలియదని, అందుకే అతని స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ముందుజాగ్రత్తగా పిలిపించినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. నిజానికి ఆసియా గేమ్స్ కోసం వెళ్తున్న భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. అక్షర్ వేలికి గాయమైందని, బంగ్లాతో మ్యాచ్లో బంతి అతని నుదురుకు తగిలిందని, తొడకండరాలు కూడా పట్టేశాయని, అందుకే వాషింగ్టన్ సుందర్ను పిలిపించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ చివరి సారి ఆడాడు.