పనాజీ: గోవా వేదికగా జరుగుతున్న 37వ నేషనల్ గేమ్స్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే మూడు పతకాలు సొంతం చేసుకున్న వ్రితి తాజాగా మరో పతకాన్ని దక్కించుకుంది. గురువారం జరిగిన మహిళల 1500మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన వ్రితి 18:03:88సెకన్ల టైమింగ్తో రజతంతో మెరిసింది.
భవ్య సచ్దేవ(17:40:80, ఢిల్లీ), శిరిణ్(18:18:21, కర్నాటక) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. టెన్నిస్ మహిళల సింగిల్స్లో శ్రీవల్లి రష్మిక 6-0, 6-1తో హర్షిణిపై విజయంతో క్వార్టర్స్లోకి ప్రవేశించింది.